{"timeout":"7000","width":"990"}
  • ధ్యానము
  • క్రతువులు
  • పవిత్ర స్థలములు
  • పరమగురువులు
  • బృంద జీవనము

ధ్యానము

ఆంతరంగికమైన ఎదుగుదలకు ధ్యానమే ఆధారము. ఆ నిశ్శబ్దపు క్షణములలోనే ఆత్మయొక్క నిశ్శబ్ద అభివృద్ధి సంభవించును.

క్రతువులు

ఆరాధన, ప్రార్థనలు, క్రతువులు, మరియు ధ్యానములు మొదలైనవన్నీ అందరిలోని 'ఒకే' వెలుగుతో సంబంధమేర్పరచుకొనుటకు సాధనములు మాత్రమే.

పవిత్ర స్థలములు

పవిత్ర స్థలములలోకి ప్రవేశించేటప్పుడు జాగరూకులమై ఉండాలి. నిశ్చితమైన అభిప్రాయములతో ప్రవేశించకూడదు. ఆ 'సమక్షము'నందు ఉండుట తప్ప ఏమీ చేయరాదు.

పరమగురువులు

పరమగురువుల జీవితములు, వారి చర్యలు, మరియు వారి బోధనల అధ్యయనము మనకు స్ఫూర్తినిచ్చి, మన ఆలోచనా ధోరణులలో మార్పులు తీసుకువస్తాయి.

బృంద జీవనము

బృంద చైతన్యమునకు, బృంద కార్యములకు, స హృదయము ఒక్కటే మార్గము.

గురుపరంపర మూలములు

“ఈ సమూహము వ్యక్తుల బహిరంగ కలయిక కాదు. వారి హృదయముల అంతరంగ సమీకరణము.”

మాస్టర్ సి. వి. వి. | మాస్టర్ యమ్. యన్. మాస్టర్ ఇ. కె. | మాస్టర్ కె. పి. కె.
WTT వీడియో ఛానల్

జగద్గురు పీఠము ఈ గురుపరంపర వాహికగా వారి మార్గదర్శకత్వములో నిర్వహించబడుతున్నది:

  • మాస్టర్ సి. వి. వి. (1868-1922) విశ్వమానవ శ్రేయస్సు, విశ్వాంతరాళమును పరిరక్షించుటకు “భృక్త రహిత తారక రాజ యోగము” ప్రసాదించిరి.
  • శ్రీ మైనంపాటి నరసింహం (మాస్టర్ యమ్. యన్., 1883-1940) మాస్టర్ సి. వి. వి. గారి వద్ద 1919 లో ఉపదేశము పొందిరి. వేలాది కుటుంబములలో యోగము నిర్వర్తింప చేసి, యోగము ద్వారా కర్మ బంధములనుండి విముక్తులను గావించిన సిద్ధ పురుషులు.

జగద్గురు పీఠమునకు స్ఫూర్తిని కలుగచేసి, తమ జీవన విధానము, బోధనల ద్వారా ఆరాధ్యులైన వారు:

జగద్గురు పీఠము, ప్రవచన పాఠములను, యోగజీవన రహస్యములను, మానవాళికి అందుబాటులోనికి తెస్తున్నది. ఈ విజ్ఞానము ప్రాక్పశ్చిమ దేశములలోని బృందములను సత్ప్రవర్తన మార్గమున నడిపించుచున్నది.